సొంత పౌరులపై ఇజ్రాయెల్ బాంబు దాడి.. పొరపాటు జరిగిందన్న ఐడీఎఫ్
- గాజా సరిహద్దుకు రెండు మైళ్ల దూరంలో పడిన బాంబు
- టెక్నికల్ మాల్ ఫంక్షన్ వల్లేనని సైన్యం ప్రకటన
- ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని వివరణ
అయితే, ఈ క్షిపణి మైదాన ప్రాంతంలో పడటంతో ప్రాణనష్టం తప్పిందని, పౌరులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ఓ ప్రకటనలో తెలిపింది. టెక్నికల్ మాల్ ఫంక్షన్ వల్లే ఈ పొరపాటు చోటుచేసుకుందని వివరణ ఇచ్చింది. ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. నిర్ యిత్ఝాక్ ప్రాంతంలో సుమారు 550 మంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రధాని నెతన్యాహు నార్తరన్ గాజాలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ పొరపాటు జరగడం గమనార్హం.