ఏపీ సరిహద్దుల్లో మద్యం అమ్మకాలు పెరిగాయి: కొల్లు రవీంద్ర
- మద్యం అమ్మకాలపై 13 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామన్న కొల్లు రవీంద్ర
- వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెడుతూ రెచ్చిపోయారని మండిపాటు
- తాను కూడా 44 రోజుల పాటు జైల్లో ఉన్నానని వ్యాఖ్య
వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెడుతూ రెచ్చిపోయారని... తాను కూడా 44 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నానని కొల్లు రవీంద్ర తెలిపారు. టీడీపీని ఇబ్బంది పెట్టిన పోలీసులకు ప్రమోషన్లు ఇచ్చారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తే కూటమి నేతల తలలు తీస్తామని ఒక మాజీ మంత్రి అన్నారని... అలాంటి వాళ్లపై కచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు.