ఐస్ క్రీంలో డిటర్జెంట్ పౌడర్, కూల్ డ్రింకుల్లో విష రసాయనాలు.. ఎక్కడంటే?
- కర్ణాటకలో అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాల తయారీ
- ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన తనిఖీలలో దారుణ విషయాలు వెలుగులోకి
- 220 దుకాణాలలో తనిఖీలు, 97 మంది యజమానులకు నోటీసులు
బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల రెండు రోజుల పాటు 220 దుకాణాలను, ఫ్యాక్టరీలను తనిఖీ చేశామని అధికారులు తెలిపారు. ఇందులో చాలా చోట్ల అపరిశుభ్రమైన వాతావరణంలోనే ఐస్ క్రీంలు, ఐస్ క్యాండీలు, శీతల పానీయాలు తయారవుతున్నాయని చెప్పారు. డిటర్జెంట్ పౌడర్, యూరియా తదితర పదార్థాలను ఉపయోగించి పాలను తయారు చేస్తున్నారని, వాటిని ఐస్ క్రీములు, క్యాండీలు తయారీలో వాడుతున్నారని తెలిపారు. దీంతో 97 దుకాణాలు, ఫ్యాక్టరీలకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను తయారుచేస్తున్న మిగతా కంపెనీలను హెచ్చరించి, పద్ధతులు మార్చుకోవాలని సూచించామని చెప్పారు.