సునీతను ఏమైనా చేస్తారనే భయం నాలో ఉంది: వైఎస్ షర్మిల
- వివేకా హత్య కేసులోని నిందితులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారన్న షర్మిల
- అవినాశ్ బెయిల్ పై ఉండటం వల్లే సునీతకు న్యాయం జరగడం లేదని వ్యాఖ్య
- హత్య జరిగినప్పుడు అక్కడ అవినాశ్ రెడ్డి ఉన్నారన్న షర్మిల
వివేకా కూతురు సునీత ప్రాణాలకు కూడా రక్షణ లేదని షర్మిల అన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు సునీతను ఏమైనా చేస్తారనే భయం తమలో ఉందని చెప్పారు. ఇటీవల తనకు కొన్ని విషయాలు తెలిశాయని... అవి తనను ఆలోచింపజేస్తున్నాయని అన్నారు. సునీతకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు.
అవినాశ్ బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో పలు విషయాలను పేర్కొందని షర్మిల తెలిపారు. విచారణ అధికారులను అవినాశ్ పిలిపించుకుని బెదిరించినట్టు అఫిడవిట్ లో ఉందని... తప్పుడు రిపోర్టుపై అధికారులతో అవినాశ్ సంతకాలు చేయించినట్టు ఉందని చెప్పారు.
అవినాశ్ బెయిల్ పై ఉండటం వల్లే సునీతకు న్యాయం జరగడం లేదని అన్నారు. వివేకాను సునీత, ఆమె భర్త చంపించినట్టు తప్పుడు రిపోర్టు ఇచ్చారని తెలిపారు. హత్య జరిగినప్పుడు ఘటనాస్థలిలో ఉన్నది అవవినాశ్ రెడ్డేనని చెప్పారు.