ఏపీలో మొదలైన ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం.. రిజల్ట్ ఎప్పుడంటే!
––
ఈ నెల 6వ తేదీలోగా మూల్యాంకనం పూర్తవుతుందని, వాటిని ఆన్ లైన్ లో నమోదు చేయడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కంప్యూటరీకరణ పూర్తయిన తర్వాత ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకూ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు విడుదల చేసేవారు. ఈసారి ఇంటర్ ఫలితాలను వాట్సప్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. విద్యార్థులు వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా లేదా BIEAP అధికారిక వెబ్సైట్ https://bie.ap.gov.in/ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చని అధికార వర్గాల సమాచారం.