మయన్మార్, థాయ్లాండ్లో పెను విపత్తు... 1000 దాటిన మృతుల సంఖ్య
- మయన్మార్లోనే 1002 మంది చనిపోయినట్లు ఆ దేశ మిలిటరీ అధికారుల వెల్లడి
- బ్యాంకాక్లో 10 మంది మృతి.. భారీ భవనం కూలిన ఘటనలో 100 మంది నిర్మాణ కార్మికుల గల్లంతు
- మయన్మార్, థాయ్లాండ్లకు ప్రపంచ దేశాలు ఆపన్నహస్తం
ఇక బ్యాంకాక్లో 10 మంది మృతిచెందగా... ఓ భారీ భవనం కూలిన ఘటనలో సుమారు 100 మంది వరకు నిర్మాణ కార్మికులు గల్లంతైనట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఈ విపత్తు వల్ల మరణాలు 10వేలు దాటొచ్చని అమెరికా ఏజెన్సీ హెచ్చరించడం గమనార్హం. కాగా, పెను విలయంతో అతలాకుతలమైన మయన్మార్, థాయ్లాండ్లకు ప్రపంచ దేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. ఇప్పటికే భారత్ 15 టన్నుల సహాయక సామాగ్రిని పంపించింది.