ఎంఎంటీఎస్ అత్యాచారయత్నం ఘటనలో పోలీసుల అదుపులో అనుమానితుడు?
- మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన మహేశ్గా గుర్తింపు
- ఫొటో చూపించగా సరిగ్గా గుర్తించలేకపోయిన బాధితురాలు
- నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
విచారణలో మహేశ్ను ఏడాది క్రితం అతని భార్య వదిలి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అతని తల్లిదండ్రులు కూడా మరణించారు. ఒంటరిగా ఉంటున్న మహేశ్ గంజాయికి బానిసయ్యాడని, అతడు గతంలో నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
మూడు రోజుల క్రితం తెల్లాపూర్-మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలులో మహిళల బోగిలో ఒంటరిగా ఉన్న బాధితురాలిపై ఒక యువకుడు అత్యాచారయత్నం చేయగా, ఆమె కొంపల్లి సమీపంలో రైలు నుంచి దూకి తప్పించుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను తొలుత గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం, మెరుగైన వైద్యం కోసం యశోద ఆసుపత్రికి తరలించారు.