ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ధోనీ-హార్దిక్ పాండ్య వైరల్ వీడియో!
- నేడు చెన్నై వేదికగా ఎంఐ, సీఎస్కే మ్యాచ్
- ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో ఇరుజట్ల ప్రాక్టీస్
- మైదానంలో ధోనీని చూసి ఆప్యాయంగా హత్తుకున్న హార్దిక్
- నెట్టింట వీడియో వైరల్
దీంతో ఇప్పటికే ఎం.ఏ. చిదంబరం స్టేడియానికి చేరుకున్న ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మైదానంలో ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య, చెన్నై మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఒకరిని ఒకరు పలకరించుకున్నారు.
ఎంఎస్డీని చూసిన హార్దిక్ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వైరల్గా మారింది. దీనిపై అభిమానులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.