అమరావతిలో పిచ్చిమొక్కల మధ్య బయటపడుతున్న సిమెంట్ బస్తాలు, నిర్మాణ సామగ్రి
- వైసీపీ అధికారంలోకి వచ్చాక నిలిచిపోయిన అమరావతి పనులు
- ఐదేళ్లుగా ఎండకు ఎండి వానకు తడిసిన నిర్మాణ సామగ్రి
- ఏపుగా పెరిగిన మొక్కలు, చెత్తా చెదారం తొలగిస్తుండటంతో బయటపడుతున్న నాటి నిర్మాణ సామగ్రి
ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా ఏపుగా పెరిగిన మొక్కలు, పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేస్తుండటంతో పాడైపోయిన వందలాది సిమెంట్ బస్తాలు, నిర్మాణ సామగ్రి బయటపడుతోంది.