పాస్ పోర్ట్ ఆఫీసులో కేసీఆర్
- డిప్లొమాటిక్ పాస్ పోర్టు మార్చుకున్న మాజీ సీఎం
- సాధారణ పాస్ పోర్టు రెన్యూవల్ చేయించుకున్నట్టు సమాచారం
- వచ్చే నెలలో అమెరికాలోని మనవడి దగ్గరికి కేసీఆర్ పయనం
పాస్ పోర్ట్ రెన్యూవల్ తర్వాత అక్కడి నుంచి నందినగర్ లోని తన నివాసానికి చేరుకున్నారు. స్వల్ప విశ్రాంతి తర్వాత తెలంగాణ భవన్ కు చేరుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. దాదాపు 7 నెలల విరామం తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ కు రావడం విశేషం. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేతలతో సమావేశం సందర్భంగా ప్లీనరీ నిర్వహణ, పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలపై కీలక నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.