వసతిగృహంలో ఇంజినీరింగ్ విద్యార్థినిపై యువకుడి అత్యాచారం
- రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన
- హాస్టల్ భవనంపై ఓ వ్యక్తి జన్మదిన వేడుకలు
- పార్టీ అనంతరం నిందితురాలి గదిలోకి ప్రవేశించిన నిందితుడు
- బాధితురాలి కేకలు విని తలుపులు వేసి బంధించిన ఇతర విద్యార్థినులు
- పోలీసులకు సమాచారం.. నిందితుడి అరెస్ట్
ఈ వేడుకల్లో నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జోన్నాయిచింతకు చెందిన అజిత్ (22) కూడా పాల్గొన్నాడు. వేడుక అనంతరం హాస్టల్లోకి వెళ్లిన అజిత్ ఒంటరిగా ఉన్న ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి కేకలు విన్న మరో గదిలోని విద్యార్థినులు తలుపునకు గడియపెట్టి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వారొచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.