వసతిగృహంలో ఇంజినీరింగ్ విద్యార్థినిపై యువకుడి అత్యాచారం

Engineering Girl Sexually Assaulted In Her Hostel Room
  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన
  • హాస్టల్ భవనంపై ఓ వ్యక్తి జన్మదిన వేడుకలు
  • పార్టీ అనంతరం నిందితురాలి గదిలోకి ప్రవేశించిన నిందితుడు
  • బాధితురాలి కేకలు విని తలుపులు వేసి బంధించిన ఇతర విద్యార్థినులు
  • పోలీసులకు సమాచారం.. నిందితుడి అరెస్ట్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంజినీరింగ్ చదువుతున్న యువతిపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతి ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లి గేట్ వద్ద ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ సమీపంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. హాస్టల్ భవనం కింద ఓ రియల్ ఎస్టేట్ ఆఫీసు ఉంది. బుధవారం రాత్రి భవనం పై అంతస్తులో రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఒకరి జన్మదిన వేడుకలు నిర్వహించారు.

ఈ వేడుకల్లో నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జోన్నాయిచింతకు చెందిన అజిత్ (22) కూడా పాల్గొన్నాడు. వేడుక అనంతరం హాస్టల్‌లోకి వెళ్లిన అజిత్ ఒంటరిగా ఉన్న ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి కేకలు విన్న మరో గదిలోని విద్యార్థినులు తలుపునకు గడియపెట్టి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వారొచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
Go Back to Shorts
Crime News
Ranga Reddy District
Ibrahimpatnam

More Telugu News