నాలుగు జాతీయ అవార్డులు దక్కించుకున్న ఏపీ
- వివిధ అంశాల్లో చూపిన పనితీరు ఆధారంగా అవార్డులు
- నాలుగు కేటగిరీల్లో అవార్డులకు ఎంపికైన నాలుగు గ్రామాలు
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్న సర్పంచ్ లు
2022-23లో చూపిన పనితీరు ఆధారంగా ఈ అవార్డులను ప్రకటించారు. అవార్డుల కార్యక్రమం ఈనెల 11న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరగనుంది. అవార్డులు గెలుచుకున్న ఆయా గ్రామాల సర్పంచ్ లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెమెంటోతో పాటు, రూ. కోటి చొప్పున నగదును బహుమతిగా అందుకోనున్నారు.