నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్రచారం: హరీశ్ రావు
- బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన పరీక్షల్లో కానిస్టేబుల్స్ ఎంపికైనట్లు వెల్లడి
- తొమ్మిది నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చేరబోతున్నారన్న హరీశ్ రావు
- వారినీ రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకుంటారేమోనని చురక
బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన పోలీసు పరీక్షల్లో ఎంపికై, ఉద్యోగాలు పొంది తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకొని, 8,047 మంది పోలీస్ కానిస్టేబుళ్లు విధుల్లో చేరబోతున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఆ కానిస్టేబుళ్లకు హరీశ్ రావు శుభాకాంక్షలు చెప్పారు.
నీతి, నిజాయతీలతో వ్యవహరిస్తూ, శాంతిభద్రతలు కాపాడడంలో నిమగ్నం కావాలని, ఉద్యోగ నిర్వహణలో రోల్ మోడల్గా నిలవాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.