సమాజంపై తిరుగులేని ముద్రవేసిన మహనీయుడు రామోజీరావు: చంద్రబాబు
- నేడు రామోజీరావు జయంతి
- రామోజీకి నివాళి అర్పించిన చంద్రబాబు
- రామోజీ జీవితాన్ని మార్గదర్శిగా భావించి ముందడుగు వేద్దామని పిలుపు
వ్యాపారాలలో సైతం సమాజహితం, ప్రజా శ్రేయస్సు చూపిన ఏకైక వ్యాపారవేత్త అని చంద్రబాబు కితాబునిచ్చారు. తన సంస్థల ద్వారా సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసిన రామోజీరావును స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. నిత్య స్ఫూర్తిగా నిలిచే రామోజీరావు జీవితాన్ని మార్గదర్శిగా భావించి అందరం ముందడుగు వేద్దామని పిలుపునిచ్చారు.