బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కేంద్రమంతి బండి సంజయ్కు లీగల్ నోటీసులు పంపారు. ఇటీవల ప్రెస్మీట్లో తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యానించారని నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో తనపై నిరాధార ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. ఈ విషయమై వారంలోపు తనకు క్షమాపణలు చెప్పనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని కేటీఆర్ హెచ్చరించారు.