హైడ్రా తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
- పట్టా భూముల్లో నిర్మాణాలను కూల్చేశారంటూ మాధవరం విమర్శలు
- బాధితులకు పరిహారం చెల్లించి ఆ భూమిని తీసుకోవాలని డిమాండ్
- కూల్చివేతల సమయంలో కోర్టు ఆదేశాలనూ లెక్కచేయడంలేదని మండిపాటు
శని, ఆదివారాలు వస్తున్నాయంటే హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారంటూ అధికారులపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శలు గుప్పించారు. అసలు హైడ్రా విధి విధానాలు ఏంటని ప్రశ్నిస్తూ.. వాటిపై స్పష్టత నివ్వాలని డిమాండ్ చేశారు. కూల్చివేతల సమయంలో కోర్టు ఆదేశాలనూ లెక్కచేయడంలేదని విమర్శించారు. ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలను దూరం చేసిన కాంగ్రెస్ సర్కారు.. ఆ విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కూల్చివేతల డ్రామాలు చేస్తున్నారని కృష్ణారావు ఆరోపించారు.