ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి మరణశిక్ష
- గతేడాది అక్టోబర్ 16న బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు
- ఆపై ఎవరికైనా చెబుతుందన్న భయంతో హత్య
- నిందితుడు బీహార్కు చెందిన గఫార్ అలీఖాన్
- 11 నెలల్లోనే తీర్పు వెలువరించిన న్యాయస్థానం
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు గఫార్ అలీఖాన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తాజాగా జరిగిన కేసు విచారణలో నిందితుడిని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం అతడికి మరణశిక్ష విధించింది. అలాగే, బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని న్యాయాధికారి జయంతి ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు. కేవలం 11 నెలల్లోనే ఈ కేసులో శిక్ష పడడం గమనార్హం.