పీఎం ఈ-డ్రైవ్... కేంద్రం నుంచి కొత్త పథకం... వివరాలు ఇవిగో!
- విద్యుత్ ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు ఫస్ట్ టైమ్ గరిష్ఠంగా పది వేల సబ్సిడీ
- రెండో ఏడాది సబ్సిడీ రూ.5 వేలు
- విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు పీఎం ఈ డ్రైవ్ పథకం
ఫేమ్ స్థానంలో 14,335 కోట్లతో రెండు పథకాలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ఇందులో పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవెల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్ హాన్స్ మెంట్ (పీఎం ఇ – డ్రైవ్) పథకానికి రూ.10,900 కోట్లు కేటాయించారు. రెండేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. ఇదే తరహాలో ఇ రిక్షాలకు రూ.25వేలు, రెండో ఏడాది రూ.12,500 వంతున చెల్లించనున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ పథకం కింద లబ్దిపొందాలంటే పీఎం ఈ – డ్రైవ్ పోర్టల్ లో ఆధార్ ఆధారిత ఈ – వోచరును జనరేట్ చేస్తారు. దానిపై కొనుగోలుదారులు, డీలర్ ఇద్దరూ సంతకాలు చేసి పోర్టల్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కొనుగోలుదాడుడు సెల్ఫీని కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.