Drought: రబీ సీజన్ లో కరవు పరిస్థితిని పరిశీలించేందుకు ఏపీకి వస్తున్న కేంద్ర బృందం

Delegation from centre will visit drought hit districts in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో రబీ సీజన్ లో నెలకొన్న కరవు పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది. రితేశ్ చౌహాన్ నేతృత్వంలోని కేంద్ర బృందం ఏపీలో కరవు పరిస్థితులను పరిశీలించనుంది. కరవు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన మంగళవారం నుంచి శుక్రవారం వరకు సాగనుంది. 

ఈ బృందంలో 10 మంది సభ్యులు ఉన్నారు. వీరు మూడు చిన్న బృందాలుగా విడిపోయి క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులు తెలుసుకోనున్నారు. కేంద్ర బృందం ప్రకాశం, అనంతపురం, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో పర్యటించనుంది.
Go Back to Shorts
Drought
Andhra Pradesh
Centre
TDP-JanaSena-BJP Alliance
NDA

More Telugu News