జగన్ గురించి మాట్లాడడం ఇక వేస్ట్: ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు
- నాపై కస్టోడియల్ టార్ఛర్ జరిగింది కాబట్టే పోలీస్ కంప్లైంట్ ఇచ్చా
- నాకే న్యాయం జరగకుంటే ప్రజలకు నమ్మకం పోతుందని వ్యాఖ్య
- కంప్లైంట్ ఇచ్చే విషయంలో తాను ఎవరితోనూ మాట్లాడలేదని వివరణ
ఇకపై జగన్ పై కానీ, వైసీపీ పైన కానీ ప్రజల దృష్టి ఉండదు, ఉండకూడదు కూడా అని వివరించారు. ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన తొలి సమావేశంలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి తమ పార్టీ నేత చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు మనకు అధికారం ఇవ్వలేదు, బాధ్యతను కట్టబెట్టారని చెప్పారు. అందుకే మనం దాడులు అవీ చేయొద్దని అందరికీ స్ఫష్టం చేశారన్నారు. తప్పు చేసిన వాళ్లను చట్టప్రకారం శిక్షించాలని చెప్పారన్నారు. అందుకే తనపై జరిగిన కస్టోడియల్ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని రఘురామ వివరించారు.
ఎందుకంటే, ఆసుపత్రి నివేదిక ప్రకారం తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. అలాంటిది నాకు నేనే న్యాయం చేసుకోకుంటే సామాన్యులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం పోతుందని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకునే పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఒకటి రెండు రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుందని వివరించారు. అంతేకానీ ఈ విషయంపై తాను ఎవరితోనూ మాట్లాడలేదని, ఎవరి సూచనల మేరకో తాను ఫిర్యాదు చేయలేదని రఘురామ కృష్ణరాజు స్పష్టం చేశారు.