విజయవాడలో డయేరియా మరణాలపై చంద్రబాబు ఆవేదన
- విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది మృతి
- బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంపై చంద్రబాబు ఆందోళన
- ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టిపెట్టాలన్న టీడీపీ అధినేత
డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదని అన్నారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించాలని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా టీడీపీ అధినేత ప్రభుత్వాన్ని కోరారు.