కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వగానే ఆహ్వాన పత్రికను అందజేస్తాం: కాంగ్రెస్ నేత వేణుగోపాల్
- కేసీఆర్ను ఆహ్వానించే బాధ్యత ప్రొటోకాల్ ఇంఛార్జ్ వేణుగోపాల్కు అప్పగింత
- హైదరాబాద్ వచ్చాక కేసీఆర్ అపాయింటుమెంట్ ఇస్తారన్న వ్యక్తిగత సిబ్బంది
- విపక్ష నేతగా, ఉద్యమ భాగస్వామిగా కేసీఆర్కు ఆహ్వానం
కాగా, ఈరోజు మధ్యాహ్నం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అపాయింటుమెంట్ కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ అపాయింటుమెంట్ ఇవ్వగానే ఆహ్వాన పత్రికను అందిస్తామని వేణుగోపాల్ తెలిపారు. విపక్ష నేతగా, ఉద్యమ భాగస్వామిగా కేసీఆర్ను ఈ వేడుకలకు ఆహ్వానిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు, రేపు సీఎం రేవంత్ రెడ్డి... గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందించనున్నారు.