సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్కు చుక్కెదురు
- తన బెయిల్ మరో వారం రోజులు పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్
- రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు అవకాశముందన్న సుప్రీం రిజిస్ట్రీ
- అందుకే పిటిషన్ లిస్టింగ్కు నిరాకరించిన సుప్రీం రిజిస్ట్రీ
అనారోగ్య, వైద్య కారణాలతో మధ్యంతర బెయిల్ పొందిన కేజ్రీవాల్ జూన్ 2న కోర్టు ఎదుట లొంగిపోవాల్సి ఉంది. అయితే తనకు మరో వారం రోజులు గడువు పొడిగించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంత బెయిల్ను పొడిగించాలని కోరారు. తాను జూన్ 9న లొంగిపోతానని పేర్కొన్నారు. కానీ సుప్రీంకోర్టులో ఆయనకు చుక్కెదురైంది.