కాంబోడియా నుంచి విశాఖ తిరిగొచ్చిన మానవ అక్రమ రవాణా బాధితులు
- విదేశాల్లో ఉద్యోగాల పేరిట స్కాం
- మోసగాళ్ల ఉచ్చులో నిరుద్యోగులు
- కాంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలంటూ ఎర
- నిరుద్యోగులను కాంబోడియా తీసుకెళ్లి చైనా కంపెనీలకు అమ్మేసిన ముఠా
- విశాఖ పోలీసుల చొరవతో బాధితులకు విముక్తి
కాంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ మోసగాళ్ల వలలో చిక్కుకున్న 150 మంది నిరుద్యోగులు... రూ.1.50 లక్షల చొప్పున చెల్లించారు. వారిని ఉద్యోగాల పేరిట కాంబోడియా తరలించిన సదరు ముఠా... అక్కడ వారిని చైనా కంపెనీలకు విక్రయించింది.
అయితే, ఈ ముఠా నుంచి ఓ వ్యక్తి తప్పించుకుని వచ్చి విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మానవ అక్రమ రవాణా గుట్టురట్టయింది.