ఓటమి భయంతోనే అరాచకాలు.. హింసపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం: టీడీపీ నేతలు
- రౌడీలు, గూండాలను జగన్ పెంచి పోషిస్తున్నారని ఆరోపణ
- పోలీసులు ఇంకా జగన్ కనుసన్నల్లో నడుస్తున్నారని విమర్శ
- జగన్ పాలనలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం కావడం బాధాకరమన్న నేతలు
- మాచర్లలో గూండాలు, రౌడీలను ముందే తీసుకొచ్చి పెట్టారని వ్యాఖ్య
- పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారంటే ఏమనాలి? అంటూ ధ్వజం
గూండాలు, రౌడీలను ముందే తీసుకొచ్చి మాచర్లలో మోహరించారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారంటే వైసీపీ ఎంతగా బరితెగించిందో అర్థమవుతోందని నేతలు మండిపడ్డారు. మాచర్లలో పర్యటించి తమ కార్యకర్తలకు ధైర్యం కల్పించడంతో పాటు పరిస్థితులను చంద్రబాబుకు నివేదిస్తామన్నారు. హింసా రాజకీయాలకు పాల్పడిన వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్పారన్నారు టీడీపీ నేతలు.