లేటుగా వచ్చారని నామినేషన్ దాఖలుకు అనుమతి నిరాకరణ
- నామినేషన్ చివరి రోజున పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులకు చుక్కెదురు
- లేటుగా వచ్చారని దళిత బహుజన పార్టీ నేత మాతంగి హన్మయ్యకు అనుమతి నిరాకరణ
- మరో స్వతంత్ర అభ్యర్థి దాసరి శ్రీకాంత్కు తప్పని నిరాశ
- మధ్యాహ్నం 3 లోపు వచ్చిన వారినే కలెక్టరేట్లోకి అనుమతిస్తామని అధికారుల స్పష్టీకరణ
అనంతరం, హన్మయ్య మాట్లాడుతూ తాను 3 గంటలలోపే వచ్చానని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అయితే, అభ్యర్థులు వచ్చిన సమయం సీసీకెమెరాల్లో రికార్డు అవుతుందని అధికారులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 3 గంటలు కాగానే మైక్లో ప్రకటించి తలుపులూ మూసివేశామని చెప్పారు.