నామినేషన్ దాఖలు చేసిన ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, శానంపూడి
- మహబూబ్ నగర్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన డీకే అరుణ
- మెదక్ లోక్ సభ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రఘునందన్ రావు
- నల్గొండ నుంచి శానంపూడి తరఫున నామినేషన్ పత్రాలు సమర్పించిన మాదగోని
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ... ఈ ఎన్నికలు ప్రత్యేక వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. 50 రోజులుగా ప్రజల అభిప్రాయాలు వింటున్నామన్నారు. ఫిర్ ఏక్ బార్... మోదీ సర్కార్ అని ప్రజలు నినదిస్తున్నారన్నారు. ఎక్కడ చూసినా అబ్ కీ బార్... చార్ సౌ పార్ నినాదాలే వినిపిస్తున్నాయన్నారు. మోదీ ఉంటేనే దేశ రూపురేఖలు మారుతాయని జనం అంటున్నారన్నారు. మోదీ పాలన వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం పెరిగిందన్నారు.