ఎల్లుండి బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్స్ అందజేత.. ఒక్కొక్కరికి రూ.95 లక్షల చెక్కు అందించనున్న కేసీఆర్
- సమావేశంలో పాల్గొననున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు
- తెలంగాణ భవన్లో మధ్యాహ్నం అందరికీ లంచ్ ఏర్పాటు
- కేసీఆర్ బస్సు యాత్ర రూట్ మ్యాప్పై చర్చించనున్న నేతలు
కాగా, కరవు కారణంగా అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం వద్దకు వెళ్లి వారి కష్ట సుఖాలను తెలుసుకోవడానికి, వారికి భరోసాను ఇవ్వడానికి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఎల్లుండి జరగనున్న ఈ సమావేశంలో కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్పై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.