ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రముఖ సినీ నిర్మాతపై కేసు నమోదు
- బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు
- కిడ్నాప్ చేసి బెదిరించారని బాధితుడి వెల్లడి
- మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యర్నేనిపై పోలీస్ కేసు
గతంలో తాను ప్రారంభించిన క్రియా హెల్త్ కేర్ కంపెనీ వాటాలను బలవంతంగా మార్పించుకున్నారని వేణుమాధవ్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో రాధాకిషన్ రావు, ఇన్ స్పెక్టర్ గట్టు మల్లు, ఎస్సై మల్లికార్జునరావుతోపాటు తన సంస్థలోని నలుగురు డైరక్టర్లు కూడా లబ్ది పొందారని చెప్పారు. కాగా, వేణుమాధవ్ ఫిర్యాదుతో సంస్థ ఎండీ రాజశేఖర్ తలశిల, డైరక్టర్లు.. గోపాలకృష్ణ సూరెడ్డి, నిర్మాత నవీన్ యర్నేని, రవికుమార్ మందలపు, వీరమాచనేని పూర్ణచంద్రరావులను ఈ కేసులో నిందితులుగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు.