Congress: చెంప పగులగొట్టాలనుకున్నా... మంత్రి సురేఖ ముందే కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై మహిళా నాయకురాలి ఆగ్రహం

  • అసెంబ్లీ ఎన్నికల నుంచి నీలం మధు, కాటా శ్రీనివాస్ మధ్య రాజకీయ పంచాయతీ
  • నీలం మధు చెంప పగులగొట్టాలి... ఆయనకు కామన్ సెన్స్ లేదన్న కాటా సుధారాణి
  • కాటా సుధారాణిని సముదాయించిన మంత్రి కొండా సురేఖ
Congress woman leader fires at neelam madhu

మంత్రి కొండా సురేఖ ముందే కాంగ్రెస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి నీలం మధుకు ఘోర అవమానం జరిగింది. నీలం మధు చెంప పగలగొట్టాలి... ఆయనకు కామన్ సెన్స్ లేదు.. అంటూ మంత్రి సురేఖ ముందే పటాన్‌చెరు కాంగ్రెస్ ఇంఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ భార్య కాటా సుధారాణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి నీలం మధు, కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య రాజకీయ పంచాయతీ కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నీలం మధును మెదక్ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ క్రమంలో వారి మధ్య సయోధ్య కుదర్చడానికి మంత్రి కొండా సురేఖ చొరవ తీసుకున్నారు. నీలం మధును కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంటికి తీసుకువెళ్లారు.

కాటా శ్రీనివాస్ గౌడ్, కాటా సంధ్యారాణిలను కలిశారు. ఈ సంద‌ర్భంగా కాటా సుధారాణి... మంత్రి ముందే నీలం మ‌ధుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధు ఏదో చెప్పబోతుండగా సుధారాణి నువ్వు ఆగు అన్నట్లుగా చేయి చూపించారు. దీంతో నీలం మధు ఆగిపోయారు. ఆ తర్వాత ఆమె ఫిర్యాదు చేశారు. తన భర్త కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే నీలం మధు బీఎస్పీ నుంచి పోటీ చేశాడని, దీంతో తన భర్త అతిస్వల్ప మెజార్టీతో ఓడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పోటీలో లేకుంటే శ్రీనివాస్ గెలిచేవాడన్నారు.  తన భర్తను ఇష్టం వచ్చినట్లు తిట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. సుధారాణిని కొండా సురేఖ సముదాయించారు.

 

  • Loading...

More Telugu News