పార్టీ మార్పు ఊహాగానాలపై తీవ్రంగా స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
- ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేసిన గంగుల
- తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
- కేసీఆర్ రంగంలోకి దిగాకే కాల్వల్లోకి నీళ్లు వస్తున్నాయన్న ఎమ్మెల్యే
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే వారిని ఆదుకోవాలని గంగుల డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే రైతులు అవస్థలు పడుతున్నారని, అందుకే కేసీఆర్ రంగంలోకి దిగారని పేర్కొన్నారు. కేసీఆర్ పర్యటన తర్వాతే కాల్వల్లోకి నీళ్లు వస్తున్నాయని గంగుల తెలిపారు.