వైసీపీ నేతల వాహనాలు పోలీసులకు కనిపించడంలేదా?: నారా లోకేశ్
- ఏపీలో ఎన్నికల కోడ్ అమలు
- గత మూడ్రోజుల్లో లోకేశ్ వాహనాలను నాలుగుసార్లు తనిఖీ చేసిన పోలీసులు
- కేవలం ప్రతిపక్ష నేతల వాహనాలనే తనిఖీ చేయడం ఏంటన్న లోకేశ్
ఇక, నిన్న విజయవాడలో చంద్రబాబు సమావేశంలో ఓ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ కనిపించడం పట్ల లోకేశ్ స్పందించారు. పార్టీ అంతర్గత సమావేశంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ కు ఏం పని? అని మండిపడ్డారు. డీజీపీని, ఇంటెలిజెన్స్ ఐజీని సస్పెండ్ చేయాలని అన్నారు.
గుంటూరు ఎస్పీ కూడా టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఆరోపించారు.