CAA: భారత ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: కేంద్ర హోంశాఖ

షార్ట్స్‌లో చూడండి
పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోంశాఖ మంగళవారం స్పష్టం చేసింది. భారత పౌరులను ఎవరినీ తమ పౌరసత్వం నిరూపించుకోవడం కోసం ఎలాంటి పత్రాలు ఎవరూ అడగరని తెలిపింది. సీఏఏ గురించి భారత ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చింది. భారత ముస్లింల పౌరసత్వంపై సీఏఏ ఎలాంటి ప్రభావం చూపించదని పేర్కొంది. హిందువులు, ఇతర మతాలతో పాటు 18 కోట్ల భారత ముస్లింలకు కూడా సమాన హక్కులు ఉంటాయని తేల్చి చెప్పింది. సీఏఏ నిన్నటి నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురి ఆందోళనపై కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది.
Go Back to Shorts
CAA
India
Central Government

More Telugu News