లోక్ సభ ఎన్నికలకు కాసేపట్లో కాంగ్రెస్ తొలి జాబితా... తెలంగాణ నుంచి ఈ తొమ్మిది మంది?
- మొదటి జాబితాలో తెలంగాణ నుంచి 9 నుంచి 11 మందిని ప్రకటించే అవకాశం
- దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలకు చెందిన 60 లోక్ సభ అభ్యర్థుల ప్రకటన?
- తెలంగాణలో 9 నియోజకవర్గాలకు ప్రచారంలో బొంతు రామ్మోహన్ సహా వీరి పేర్లే...
తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గాను 9 నుంచి 11 మంది అభ్యర్థులను ప్రకటించవచ్చునని సమాచారం. సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, చేవెళ్ల నుంచి సునితా మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్, మెదక్ నుంచి నీలం ముదిరాజ్ పేర్లను ప్రకటించవచ్చునని ప్రచారం సాగుతోంది.