తెలంగాణలో ఒంటిపూట బడులు.. ఎప్పటి నుంచంటే..?
- ఈ నెల 15 నుంచి స్కూళ్లు మధ్యాహ్నం వరకే
- ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 కు క్లోజ్
- ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు ?
పదో తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో..
పదో తరగతి పరీక్షా కేంద్రాలలో మాత్రం మధ్యాహ్నం తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం పూట పరీక్ష నిర్వహించి, మధ్యాహ్నం పిల్లలకు క్లాసులు చెప్పనున్నారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసిన తరువాత తరగతులను నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షలు పూర్తయిన తరువాత తిరిగి ఉదయం వేళ స్కూల్స్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.