అమెరికాలో భారత సంతతి ఇంజినీర్కు ప్రతిష్ఠాత్మక అవార్డు
- రైస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అశోక్ వీరరాఘవన్కు ఈడిత్ అండ్ పీటర్ ఓ డానల్ అవార్డు
- అవార్డును ప్రకటించిన ది టెక్సాస్ అకాడమి ఆఫ్ మెడిసిన్, ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ
- ఇమేజింగ్ టెక్నాలజీలో విప్లవాత్మక పరిశోధనలకు గాను అరుదైన గుర్తింపు
వీరరాఘవన్ బృందం ఇమేజింగ్ టెక్నాలజీలో పలు విప్లవాత్మక పరిశోధనలు చేస్తోంది. ఆప్టిక్స్ నుంచి సెన్సార్ డిజైన్ వరకూ మెషిన్ ఆల్గొరిథమ్ సాంకేతికతో ఇమేజింగ్ రంగంలోని పలు సవాళ్లను అధిగమించారు. ఈ అంశాలన్నిటిపైనా సమీకృత విధానంలో పరిశోధన చేస్తున్నామని ప్రొ. వీరరాఘవన్ తెలిపారు. ప్రస్తుత సాంకేతికతతో చూడటం సాధ్యం కాని వాటిని కనిపించేలా చేయడమే తమ లక్ష్యమని వీరరాఘవన్ తెలిపారు.