నా దూకుడును హరీశ్ రావు తట్టుకోలేక జైల్లో పెట్టించాడు: జగ్గారెడ్డి
- కాంగ్రెస్ గెలిచిందన్న ఆనందంలో తన ఓటమి బాధను మర్చిపోయానన్న జగ్గారెడ్డి
- తనకు కావాల్సిన పదవి తప్పకుండా వస్తుందని ధీమా
- కేసీఆర్ సొంత జిల్లాలో లక్ష మందితో సభ పెట్టానని వెల్లడి
ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనను పిలిచి రాహుల్ సభను పెడదామని అడిగారని... దీంతో, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్న సమయంలో కేసీఆర్ సొంత జిల్లాలో లక్ష మందితో సభ పెట్టానని తెలిపారు. తన దూకుడును హరీశ్ రావు తట్టుకోలేక పోయారని... తనను టార్గెట్ చేసి జైల్లో వేయించారని చెప్పారు. బీఆర్ఎస్ లో చక్రం తిప్పే హరీశ్ జిల్లాలో తన మార్క్ ను చూపించానని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందని చెప్పారు.