ధరణిని మార్చేసి కొత్త పోర్టల్ తీసుకొస్తామన్న మంత్రి
- హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
- ధరణి కారణంగా రైతులకు సమస్యలు.. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం
- తప్పుడు పత్రాలతో సర్కారు భూములను పట్టా చేసుకున్నారని ఆరోపణ
ధరణి సమస్యలను తొలగించేందుకు త్వరలోనే కొత్త పోర్టల్ ను తీసుకొస్తామని చెప్పారు. దీనికోసం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ భూమిని కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. సర్కారు భూములను సొంతం చేసుకున్నవారితో పాటు వారికి హక్కులు కల్పించిన అధికారులు, సిబ్బందిపైనా చర్యలు తప్పవన్నారు. ఒకే సర్వే నంబరులో పార్ట్-బి పేరుతో ఉన్న భూములపై విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.