రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: చంద్రబాబు
- రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోటీ చేయరన్న చంద్రబాబు
- వైసీపీ కీలక నేతలు టచ్ లోకి వస్తున్నారని వెల్లడి
- అన్నీ లోతుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయన్న టీడీపీ అధినేత
వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు టీడీపీకి టచ్ లోకి వస్తున్నారని చంద్రబాబు చెప్పారు. అయితే ఆ పార్టీ నుంచి వచ్చే అందరినీ తీసుకోలేమని తెలిపారు. చేరికలు, పొత్తుల కారణంగా పార్టీ కోసం కష్టపడిన నేతలకు నష్టం జరగకూడదని చెప్పారు. అన్నీ లోతుగా ఆలోచించే నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ఈ సమావేశంలో రా కదలిరా, నారా లోకేశ్ శంఖారావం సభలతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చించారు.