నేడు మేడారం మహా జాతర ప్రారంభం
- మండమెలిగే ప్రత్యేక పూజలతో నేడు జాతర ప్రారంభం
- బుధవారం నుంచి గురువారం వేకువజాము వరకూ వేడుక
- ఉదయమంతా మండమెలిగే పూజలు, రాత్రంతా గద్దెలపై పూజారుల జాగారం
పూర్వకాలంలో ఈ ఆలయాల స్థానంలో గుడిసెలు ఉండేవి. రెండేళ్లకు ఇవి పాతబడి పోవడంతో పూజారులు అడవికి వెళ్లి మండలు (చెట్టుకొమ్మలు), వాసాలు, గడ్డి తీసుకొచ్చి కొత్త గుడి నిర్మించి పండగ జరుపుకునేవారు. దీనినే మండమెలిగే పండగ అంటారు. ఇందులో భాగంగా పూజారులు పగలంతా తలో పని చేసి, రాత్రంతా దేవతల గద్దెలపై జాగారం చేస్తారు.