Palla Rajeshwar Reddy: జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, భార్య నీలిమపై కేసు

Police case filed against palla rajeswar reddy and wife
  • పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
  • తప్పుడు పత్రాలతో భూఆక్రమణకు ప్రయత్నించారని ఆరోపణలు
  • పీర్జాదిగూడకు చెందిన రాధిక అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు

బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన భార్య నీలిమపై కేసు నమోదయింది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదయింది. తప్పుడు పత్రాలతో భూఆక్రమణకు యత్నించారని ఆరోపణలు వచ్చాయి. పీర్జాదిగూడకు చెందిన రాధిక అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై దర్యాఫ్తు చేపట్టిన పోలీసులు ఎమ్మెల్యే దంపతులపై కేసు నమోదు చేశారు.

జోడిమెట్ల సమీపంలోని చౌదరిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఫ్లాట్ల విషయంలో పల్లా దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్లాట్లు 1984లో లే అవుట్ అయినట్లుగా చెబుతున్నారు. ఇక్కడి 160 మంది ప్లాట్ యజమానులను ఆయన ఇబ్బంది పెడుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి ప్లాట్లు తాను చెప్పిన ధరకు తనకే ఇవ్వాలని లేదంటే ఈ ప్లాట్లు దక్కనీయనని పల్లా హెచ్చరించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తమ ప్లాట్లను ఆక్రమించారంటూ రాధిక అనే బాధితురాలు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News