అయోధ్యలో అత్యవసర సేవల చిరు ఆసుపత్రి ‘భీష్మ’!
- త్వరలో అందుబాటులోకి తేనున్నట్టు చెప్పిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
- అత్యవసర వైద్య సేవల నిమిత్తం ఈ మొబైల్ యూనిట్ సిద్ధం చేసినట్టు వెల్లడి
- యూపీ ప్రభుత్వంతో కలిసి అయోధ్యలో సమగ్ర వైద్య సేవలు అందించనున్నట్టు వివరణ
ఘనాకారంలో ఉండే ‘భీష్మ’లో అత్యాధునిక వైద్య పరికరాలు ఉంటాయి. కృత్రిమ మేధ, అంతర్జాల సాంకేతికత సాయంతో ఈ ఆసుపత్రి సమర్థవంతమైన సేవలను అందిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.