రామోజీ ఫిలింసిటీలో క్రేన్ కూలిపోయి సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో మృతి
- సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న విస్టెక్స్ సంస్థ
- అతిథులను క్రేన్ ద్వారా వేదికపై దించే ప్రయత్నం విషాదాంతం
- క్రేన్ తీగలు తెగిపోయి కూలిపోయిన కంపార్ట్ మెంట్
విస్టెక్స్ కంపెనీ తమ సిల్వర్ జూబ్లీ వేడుకలను రామోజీ ఫిలింసిటీలో నిర్వహించుకుంటోంది. కొందరు అతిథులను కొంత ఎత్తు నుంచి నేరుగా వేదిక మీదకు దించుతుండగా, క్రేన్ కు ఉన్న తీగలు తెగిపోయాయి. దాంతో ఆ అతిథులు ఉన్న కంపార్ట్ మెంట్ పై నుంచి పడిపోయింది. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.