వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టుకు వచ్చిన అవినాశ్ రెడ్డి

YS Avinash Reddy attends CBI Court
  • నాంపల్లి సీబీఐ కోర్టులో వివేకా హత్య కేసు విచారణ
  • రిమాండ్ లో ఉన్న నిందితులు కూడా కోర్టుకు హాజరు
  • తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా
హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ జరిగింది. ఈనాటి విచారణకు ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హాజరయ్యారు. చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న ఆరుగురు నిందితులను కూడా పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణను సీబీఐ కోర్టు జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది.
Go Back to Shorts
YS Avinash Reddy
YS Vivekananda Reddy
CBI Court

More Telugu News