ఇతరులకు బానిసలుగా మారకండి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర ట్వీట్
- రచయిత డాన్ కో సందేశాన్ని పంచుకున్న లక్ష్మీనారాయణ
- చర్చనీయాంశంగా మారిన ట్వీట్
- గతంలో జనసేన పార్టీకి రాజీనామా చేసి బయటికి వచ్చిన లక్ష్మీనారాయణ
"మీకు ఆలోచనలు లేకపోతే... చదవండి. మీకు ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని స్పష్టంగా చెప్పలేకపోతే... వాటిని వ్రాయండి. మీకు ఆలోచనలు ఉండి, వాటిని అమలు చేయడానికి స్పష్టత ఉంటే నిర్మాణాత్మకంగా వ్యవహరించండి. అంతే తప్ప ఇతరులకు బానిసలుగా మారకండి" అంటూ హితబోధ చేస్తున్నట్టుగా ఉన్న ఆ వ్యాఖ్యలను లక్ష్మీనారాయణ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
లక్ష్మీనారాయణ 2020లో జనసేన పార్టీ నుంచి బయటికి వచ్చేసిన సంగతి తెలిసిందే.