రామమందిరం ప్రారంభోత్సవానికి హాజరు కానున్న సచిన్, కోహ్లీ!
- రామమందిర ప్రారంభోత్సవానికి సచిన్, కోహ్లీలకు ఆహ్వానం అందినట్టు సమాచారం
- జనవరి 22న జరిగే ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని
- సుమారు 6 వేల మంది అతిథులకు ఆహ్వానం పంపిన శ్రీరామ మందిర ట్రస్ట్
అయితే, రామమందిర ప్రారంభోత్సవం తరువాత జనవరి 25న ఇంగ్లండ్తో టీమిండియా టెస్టు సరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు హైదరాబాద్లో నిర్వహించనున్న నేపథ్యంలో రామమందిర కార్యక్రమం తరువాత వెంటనే కోహ్లీ హైదరాబాద్కు తిరిగి రావాల్సి ఉంటుంది.
అయోధ్యలో మొత్తం 8.64 ఎకరాల్లో విస్తరించిన రామమందిరంలో ఐదు మండపాలు ఉన్నాయి. గర్భగుడితో పాటూ గుధ్ మండపం, రంగ మండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపాన్ని నిర్మించారు.