అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠకు 6000 మంది అతిథులు
- జనవరి 22న అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం
- దేశం నలుమూలల నుంచి హాజరు కానున్న సాధుసంతులు
- పోస్టు ద్వారా తొలి ఆహ్వానపత్రిక అందుకున్న మహంత్ విష్ణుదాస్
పోస్టు ద్వారా ఆహ్వానపత్రికలు పంపడంతోపాటు వాట్సాప్ ద్వారా పీడీఎఫ్ ఫైళ్లు కూడా పంపించారు. అతిథులు తమ ఆధార్ కార్డులను విధిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయోధ్య సాధువులు అతిథులను సాదరంగా ఆహ్వానిస్తారు. మెగా ప్రాణ ప్రతిష్ఠకు రాముడి ఆశీర్వాదంతో తనకు తొలి ఆహ్వాన పత్రిక అందిందని మహంత్ విష్ణుదాస్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి సాధుసంతులు వస్తున్నట్టు తెలిపారు.