Stock Market: మార్కెట్లకు ఈరోజు కూడా లాభాలే

Markets ends in profits
  • 87 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 37 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3 శాతానికి పైగా లాభపడ్డ అల్ట్రాటెక్ సిమెంట్ షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 87 పాయింట్లు లాభపడి 66,988కి చేరుకుంది. నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి 20,133 వద్ద స్థిరపడింది. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (3.14%), సన్ ఫార్మా (2.19%), భారతి ఎయిర్ టెల్ (1.91%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.80%), విప్రో (1.75%). 

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.19%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.02%), రిలయన్స్ (-1.00%), ఏసియన్ పెయింట్స్ (-0.95%), టాటా మోటార్స్ (-0.83%).  

  • Loading...

More Telugu News