సౌతాఫ్రికాతో వైట్బాల్ సిరీస్.. విరాట్ కోహ్లీ దూరం
- డిసెంబరు 10 నుంచి టీమిండియా సౌతాఫ్రికా టూర్ ప్రారంభం
- మూడు వన్డేలు, మూడు టీ20, రెండు టెస్టులు ఆడనున్న భారత జట్టు
- వన్డేలు, టీ20లకు కోహ్లీ దూరం
- బ్రేక్ తీసుకున్నట్టు చెబుతూ బీసీసీఐకి సమాచారం
గత కొంతకాలంగా నాన్స్టాప్గా క్రికెట్ ఆడుతున్న కోహ్లీ ప్రస్తుతం లండన్లో ఉన్నాడు. ప్రపంచకప్కు ముందు కూడా కోహ్లీ ఒకసారి క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రెస్ట్ తీసుకుని ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం యూకేలో ఉన్న కెప్టెన్ రోహిత్శర్మ వైట్బాల్ సిరీస్కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.