జనవరి 22న అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠాపన
- కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
- మొత్తం 4 దశల్లో ప్రతిష్ఠాపన కార్యక్రమం
- నాలుగో దశలో జనవరి 26 నుంచి భక్తులకు దర్శన భాగ్యం
అర్చక పోస్టులకు భారీగా దరఖాస్తులు
అయోధ్య రామ మందిరంలో అర్చక పోస్టులకు భారీ స్పందన కనిపిస్తోంది. దాదాపు 3 వేల దరఖాస్తులు రాగా ఇందులో 200 మందిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. చివరిగా 20 మందిని ఎంపిక చేయనున్నట్లు ట్రస్టు ప్రతినిధులు వివరించారు. ఇదిలావుండగా 14వ అయోధ్య నగర ప్రదక్షిణ కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. నవంబర్ 21(మంగళవారం) తెల్లవారుజామున 2 గంటలకు ప్రదక్షిణ మొదలై రాత్రి 11.38 గంటలకు ముగియనుందని నిర్వాహకులు తెలిపారు.